గ్రూప్-1మెయిన్స్‌కు లైన్ క్లియర్.. పిటిషన్లు కొట్టివేత!

-

గ్రూప్-1 మెయిన్స్‌కు ఇప్పటివరకు ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. గతంలో నిర్వహించిన గ్రూప్-1 పరీక్షల్లో 7 ప్రశ్నలు తప్పుగా వచ్చాయని, తమకు అన్యాయం జరుగుతుందని పదికి పైగా పరీక్షలు రాసిన అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. తాజాగా మంగళవారం గ్రూప్-1పై దాఖలపైన పిటిషన్లకు సంబంధించి తుది తీర్పును వెలువరించింది.

మరోవారంలోగా జరగాల్సి ఉన్న గ్రూప్‌-1 మెయిన్స్‌కు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌పై దాఖలైన పిటిషన్లను డిస్మిస్ చేస్తూ సంచలన తీర్పు చెప్పింది. ఈ క్రమంలోనే రెండు పిటిషన్లను కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు.. ఈనెల 21న జరగాల్సిన మెయిన్ పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో గ్రూప్-1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన అభ్యర్థులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news