శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ సినీ నటుడు

-

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ఆదివారం నైవేద్య విరామ సమయంలో సినీ నటుడు కిరణ్ అబ్బవరం దర్శించుకున్నారు. దర్శనం తరువాత వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల కిరణ్ అబ్బవరం మీడియాతో మాట్లాడారు. ‘క’ సినిమా ఈనెల 31వ తేదీ దీపావళి సందర్భంగా విడుదల కానుంది.

ప్రతీ సినిమా విడుదలకు ముందు స్వామి వారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అలాగే ఈ సినిమా నాకు నా కెరీర్ కు చాలా ముఖ్యమైనది. ప్రేక్షక దేవుళ్లు సినిమాని చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నారు. తమిల, కన్నడ భాషల్లో థియేటర్ల కొరత కారణంగా విడుదల తేదీ మార్చడం జరిగింది. నేను మరో మూడు సినిమా ప్రాజెక్ట్స్ చేస్తున్నానని తెలిపారు. క మూవీ తప్పకుండా విజయం సాధిస్తుందని.. కొత్తగా ఉంటుందని చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news