కొచ్చి ఎయిర్ పోర్టుకు చేరుకున్న పవన్ కళ్యాణ్.. ఎందుకంటే?

-

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో ఆధ్మాత్మిక పర్యటనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ముందుగా కేరళలోని కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం కేరళలోని ప్రముఖ ఆలయాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకుంటారని తెలుస్తోంది.

ఆ తర్వాత మిగతా తమిళనాడు,కర్ణాటక రాష్ట్రాల్లోనూ ఆయన పర్యటన కొనసాగనుంది. నాలుగు నుంచి ఐదు రోజుల పాటు ఈ పర్యటన కొనసాగుతుందని తెలుస్తోంది. అందుకోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కాగా, పవన్ కళ్యాణ్ గత కొద్దిరోజులుగా స్పండిలైటీస్, జ్వరంతో బాధపడుతున్నట్లు సమాచారం. అయినప్పటికీ ఆయన ఆధ్యాత్మిక పర్యటనలు చేయాలని నిర్ణయించుకోవడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news