ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాలో యువతిపై యాసిడ్ దాడి ఘటనను సీఎం చంద్రబాబు ఖండించారు. నిందితుడి పై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. బాధిత యువతి, ఆమె కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని సీఎం చంద్రబాబు భరోసా కల్పించారు.
గుర్రంకొండ మండలం ప్యారంపల్లె గణేష్ అనే యువకుడు ఓ యువతి తల పై కత్తితో గాయపరిచి ముఖం పై యాసిడ్ పోశాడు. గాయాలపాలైన బాధితురాలుని మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఏప్రిల్ 29న ఆమె పెళ్లి జరగనున్న నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంటున్నట్టు సమాచారం. నిందితుడిని మదనపల్లెలోని అమ్మ చెరువు మిట్టకు చెందిన వాడిగా గుర్తించారు.