ఎమ్మెల్సీ రాకపోవడంపై పిఠాపురం వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. టిడిపి తో 23 ఏళ్ళు అనుబంధం ఉందన్నారు. చంద్రబాబు ఆదేశాలు మేరకు పని చేస్తానని ప్రకటించారు. కొన్ని ఇబ్బందులు ఉంటాయని తెలిపారు. ప్రజలకు సేవ చేసే అవకాశం చంద్రబాబు ఇచ్చారని తెలిపారు. కూటమి విజయానికి నాకు అప్పగించిన బాధ్యతలు పూర్తి చేశానని తెలిపారు.

ఇదే అంశంపై కేఏ పాల్ చాలా సీరియస్ అయ్యారు. పిఠాపురం వర్మా కు ఎమ్మెల్సీ టికెట్ రాకపోవడంపై కేఏ పాల్ స్పందించారు. పిఠాపురం వర్మా.. నీకు బుద్ధుందా.. చంద్రబాబు మాట నిలబెట్టుకోడని అప్పుడే చెప్పాను కదా అంటూ మండిపడ్డారు. నేను చెప్పినట్లే పవన్ కళ్యాణ్ తన అన్నకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చాడన్నారు. పిఠాపురం వర్మకు తదుపరి జరిగే మొట్టమొదటి ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే అవకాశం ఇస్తా అన్నాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కేఏ పాల్.