సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం బాయ్‌కాట్.. బీఆర్ఎస్ నేతల వాకౌట్

-

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి.శనివరాం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ కొనసాగుతుండగా..రైతు రుణమాఫీతో పాటు గృహ జ్యోతి పథకాలపై అధికార, విపక్ష సభ్యుల నడుమ వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో బీఆర్ఎస్ సభ్యులు సంధించిన ప్రశ్నలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు..

మంత్రి శ్రీధర్ బాబు తమదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతుండగా.. బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. సీఎం ప్రసంగాన్ని తాము బాయ్‌కాట్ చేస్తున్నట్లు ప్రకటించారు. తమ అధినేత కేసీఆర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వాకౌట్ చేస్తున్నట్లుగా వారు ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news