కాంగ్రెస్ సర్కార్ ప్రతిపక్షాల గొంతు నొక్కుతోంది : హరీశ్ రావు

-

అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ప్రశ్నోత్తరాలను రద్దు చేసి జీరో అవర్ నిర్వహించడంపై ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల సాక్షిగా ప్రభుత్వం తమ గొంతు నొక్కుతోందని అన్నారు. విపక్షంలో తమతో పాటు ఉన్న ఎంఐఎం పార్టీకి కూడా మంత్రులను ప్రశ్నలు అడిగేందుకు కనీస అవకాశం ఇవ్వకపోవడం దారుణమన్నారు.ఇదే అంశంపై స్పీకర్ను ప్రశ్నించినా ఆయన నుంచి సమాధానం కరువైందని చెప్పారు.

సభ్యుల హక్కులను కాపాడే బాధ్యత స్పీకర్‌పైనే ఉందని, ప్రశ్నోత్తరాలు రద్దు చేయడంపై ఆయన వెంటనే సమాధానం చెప్పాలని అన్నారు.మరోవైపు ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను సైతం ఆన్‌లైన్లో పెట్టాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో పంటలు ఎండుతున్నాయని గుర్తుచేశారు. హెచ్ఎండీఏ భూములను తాకట్టు పెట్టి మరో రూ.20 వేల కోట్లు అప్పు తెచ్చేందుకు సర్కార్ రెడీ అవుతోందని హరీశ్ రావు ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news