రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 28 కొత్త బార్ల మంజూరుకు అనుమతించింది రేవంత్ సర్కార్. ఎక్సైజ్ శాఖ ద్వారా భారీగా ఆదాయం పెంచేందుకు కృషి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 24, మహబూబాబాద్, బోధన్, నిజామాబాద్, సరూర్ నగర్ మున్సిపాలిటీల్లో ఒక్కో బార్ చొప్పున దరఖాస్తులు ఆహ్వానించారు ఎక్సైజ్ అధికారులు.

గతంలో పలు కారణాల వల్ల తిరస్కరించబడిన బార్లకు తిరిగి అనుమతులు ఇచింది ఎక్సైజ్ శాఖ. ఈ నెల 15వ తేదీ నుండి జూన్ 6వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించాలని వెల్లడించారు ఎక్సైజ్ అధికారులు.