మహిళా సంఘాల సభ్యులకు రేవంత్ రెడ్డి సర్కార్ శుభవార్త అందజేసింది. మహిళా సంఘాలలో ఉన్న సభ్యుల ఆదాయాన్ని పెంచడానికి నిర్ణయం తీసుకున్నారు. అలాగే విద్యుత్ భారాన్ని తగ్గించడానికి పీఎం సూర్యఘర్ పథకం కింద సోలార్ యూనిట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రతి సంవత్సరం లక్ష మంది సభ్యుల ఇళ్లపై సోలార్ యూనిట్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

శ్రీనిధి సమాఖ్య ద్వారా నాలుగు శాతం వడ్డీ రాయితీతో మహిళా సంఘాలలోని సభ్యులకు రుణాలు అందజేస్తారు. కేంద్రం రూ. 78000 రాయితీ అందజేస్తుంది. ఈ యూనిట్లు 25 ఏళ్ల వరకు పనిచేస్తాయి. ఐదేళ్లలో అప్పు తీరిన అనంతరం 20 ఏళ్లు విద్యుత్ అమ్మకాల ద్వారా ఆదాయాన్ని పొందవచ్చు. ఈ విధానాన్ని తొందర్లోనే ప్రారంభించనున్నారు. దీంతో మహిళా సంఘాల నేతలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.