ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలకు శుభవార్త అందజేస్తుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. జూన్ 1వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ లో రేషన్ పంపిణీ విధానంలో చాలా రకాల మార్పులు వచ్చిన విషయం తెలిసిందే. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎండియు వాహనాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించేవారు. ఈ విధానాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రద్దు చేసింది. రేషన్ దుకాణాల ద్వారానే రేషన్ సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు.

జూన్ 1 నుంచి ఈ విధానాన్ని అమలు చేశారు. దివ్యాంగులు, వృద్ధులకు రేషన్ తరపున ఇంటి వద్దకే వచ్చి పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు రేషన్ పంపిణీలో ఎలాంటి అక్రమాలు జరగకుండా ఉండడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక రకాల చర్యలను చేపడుతుంది. ఇందులో భాగంగానే రేషన్ షాప్ ల వద్ద క్యూ ఆర్ కోడ్ ను ఏర్పాటు చేస్తూ ఏమైనా ఫిర్యాదులు ఉన్నట్లయితే స్కాన్ చేసి ఫిర్యాదుల రూపంలో తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూచనలు చేస్తోంది.