తెలంగాణ రైతులకు శుభవార్త..జూన్ 15 తర్వాత రైతు భరోసా నిధులు !

-

తెలంగాణ ప్రభుత్వం రైతులకు భారీ శుభవార్తను అందజేసింది. రైతు భరోసా నిధులను రైతు అకౌంట్లోకి జమ చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధులను రైతుల అకౌంట్లోకి ఒకేసారి రూ. 12,000 జమ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. జూన్ మూడవ వారం నాటికి ఈ సాయం అందించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు చేపడుతున్నారు. దాదాపు 70 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. అయితే దీనికి రూ. 15 వేల కోట్లకు పైగా నిధులు అవసరం అవడంతో అది ప్రభుత్వానికి సవాలుగా మారుతుంది.

Telangana Rythu Bharosa fund transfer to farmers begins soon
Telangana Rythu Bharosa fund transfer to farmers begins soon

ఇటీవలే పంట నష్టం జరిగిన రైతులకు ప్రభుత్వం ఎకరానికి రూ. 10,000 చొప్పున సాయం అందించింది. ఇప్పుడు మరో విధానాన్ని అమలు చేయడంతో తెలంగాణ ప్రభుత్వం లోని రైతులు సంతోషంలో ఉన్నారు. మరోవైపు విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేపట్టడంతో రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. వరి, కంది, పెసర, మినుము, జొన్న విత్తనాల కిట్లను నిన్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందిస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. నిన్న కొంతమందికి ఈ కిట్లను అందించగా మరి కొంత మందికి పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news