ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా కేసులు సాధారణంగా పెరిగితే ఎలాంటి సమస్య ఉండబోయేది. కానీ ఏపీలో కొత్త వేరియంట్ కలకలం రేపుతోంది. విశాఖలో గత నెలలో నమోదైన కొవిడ్ కేసులకు సంబంధించిన నమూనాలను పుణెలోని NIVలో పరీక్షించగా ఒమిక్రాన్ (బీఎ.2) వేరియంట్గా తేలింది.

విశాఖ KGH వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. అయితే ఒమిక్రాన్ గురించి ఆందోళన చెందనక్కర్లేదని, ఎవరికివారు వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచించారు. మరోవైపు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కొవిడ్ కేసులు 17 ఉన్నట్లు తెలుస్తోంది.