ముద్రగడ పద్మనాభానికి షాక్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం.. కాపు ఉద్యమకారులపై కేసులు కొట్టేస్తూ ఇచ్చిన తీర్పుపై అప్పీల్ కు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది చంద్రబాబు నాయుడు సర్కార్. ఇందులో భాగంగానే హైకోర్టులో అప్పీల్ చేయాలని పీపీని ఆదేశిస్తూ హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

గత వైసీపీ ప్రభుత్వంలో కాపు ఉద్యమకారులపై కేసులు కొట్టివేసింది. తుని ఘటనలో కాపు ఉద్యమకారుల కేసులను పునః విచారించాలని నిర్ణయం తీసుకుంది చంద్రబాబు నాయుడు సర్కార్.
- కాపు ఉద్యమకారులపై కేసులు కొట్టేస్తూ గత ప్రభుత్వం ఇచ్చిన తీర్పుపై హైకోర్టులో అప్పీల్కి వెళ్లనున్న చంద్రబాబు ప్రభుత్వం
- తుని రైలు దగ్దం ఘటనలో ముద్రగడ సహా కాపు ఉద్యమకారులపై కేసులు కొట్టేస్తూ గత వైసీపీ ప్రభుత్వంలో తీర్పు
- కేసును మళ్ళీ విచారించాలని ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయం
- కేసులు కొట్టేస్తూ ఇచ్చిన తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేయాలని పీపీని ఆదేశిస్తూ హోంశాఖ ఉత్తర్వులు