11 మంది RCB ఫ్యాన్స్ మృతి చెందటంపై DK శివకుమార్ కీలక ప్రకటన చేశారు. మృతుల కుటుంబాలకు క్షమాపణలు చెప్పిన కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్… సంతాపం తెలిపారు. విధుల్లో 5 వేల మంది పోలీసులు ఉన్నారని తెలిపిన శివకుమార్… ఘటనకు పోలీసులు, ప్రభుత్వం కారణం కాదన్నారు.

సడన్గా 19వ గేటు ఓపెన్ చేశారని సాక్షులు చెబుతున్నట్లు గుర్తు చేశారు కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్.. మృతుల్లో నలుగురు మహిళలు, ఒక బాలుడు ఉన్నట్లు సమాచారం సమాచారం. కాగా 20 మందికి గాయాలు అయ్యాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఫ్రీ పాస్ ల విషయంలోనూ ఆర్సిబి అభిమానుల మధ్య గొడవ జరిగింది. ఈ విషయం పైన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.