ఏపీ టెన్త్, ఇంటర్మీడియెట్ విద్యార్థులకు గుడ్ న్యూస్. టెన్త్, ఇంటర్మీడియెట్ లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అవార్డులు ఇవ్వనుంది కూటమి సర్కార్. షైనింగ్ స్టార్స్ పేరుతో అవార్డులు ఇవ్వనుంది ఏపీ ప్రభుత్వం. ఇవాళ జిల్లా కలెక్టర్, జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆధ్వర్యంలో అవార్డుల ప్రదానోత్సవం ఉండనుంది.

2024-25 విద్యా సంవత్సరానికి అవార్డులు ఇచ్చేందుకు మార్గదర్శకాలు విడుదల చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేయనున్నారు. అవార్డులో రూ. 20 వేల నగదు, మెడల్, అప్రిషియేషన్ సర్టిఫికెట్ ఇస్తారు. 10వ తరగతి 500 మార్కులు పైబడి వచ్చిన విద్యార్థులకు, ఇంటర్మీడియట్ 830 మార్కులు పైబడి వచ్చిన విద్యార్థులకు అవార్డులు ఇస్తారు. కాగా రెండు రోజుల కిందట ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల అయిన సంగతి తెలిసిందే. మే 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు కొనసాగిన సంగతి తెలిసిందే.