వివాహేతర సంబంధం.. ఆంటీ కోసం ప్రియుడి ఆత్మహత్య చేసుకున్నాడు. వివాహేతర సంబంధం పెట్టుకున్న ఇద్దరు వివాహితులు ఒకరి తర్వాత మరొకరు ఆత్మహత్య చేసుకున్నారు. తొలుత ప్రియురాలు ఆత్మహత్య చేసుకోగా.. ఆమె అంత్యక్రియలు జరిగే లోపే బలవన్మరణానికి పాల్పడ్డాడు ప్రియుడు. మెదక్ జిల్లా హవేళిఘనపూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన నరేష్ (31)కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, అదే గ్రామానికి చెందిన మరో వివాహితతో అతనికి కొంతకాలంగా వివాహేతర సంబంధం పెట్టుకున్న నరేష్.. సదరు వివాహితకు సైతం భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
వీరి వ్యవహారం బయటపడడంతో గతంలో పంచాయితీ పెట్టి మందలించారు పెద్ద మనుషులు. అయితే, కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతూ ఇంట్లో ఎవరూ లేని సమయంలో జూన్ 2న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు సదరు వివాహిత. మరుసటి రోజు ఇంటికి వచ్చిన కుటుంబసభ్యులు ఆమెను గమనించి ఆసుపత్రికి తరలించగా.. నాటి నుంచి చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందింది వివాహిత. ఈ విషయం తెలుసుకున్న ఆమె ప్రియుడు నరేష్.. తన ప్రియురాలి దహన సంస్కారాలు జరుగుతున్న సమయంలోనే లింగ్సాన్ పల్లి శివారులోని అటవీ ప్రాంతంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.