జీవితాంతం నెలకు 20 వేలను పొందాలంటే.. ఈ ప్లాన్ ను తప్పకుండా ఎంపిక చేసుకోవాల్సిందే..!

-

ఆర్థిక అవసరాల కోసం ప్రజలు వివిధ రకాల ఇన్సూరెన్స్ ప్లాన్లను ఎంచుకుంటారు. వాటిలో, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేక ప్లాన్లను అందిస్తుంది. ముఖ్యంగా, పెన్షన్ ప్లాన్‌కు సంబంధించి జీవన్ ఉత్సవ్ పాలసీని ప్రవేశపెట్టింది. ఈ పాలసీ ద్వారా, 16 సంవత్సరాలు ప్రీమియం చెల్లించిన తర్వాత, జీవితాంతం ప్రతి ఏడాదికి 2.5 లక్షల రూపాయలు పొందవచ్చు అంటే, నెలకు దాదాపు 20 వేల రూపాయల వరకు అందుకునే అవకాశం ఉంటుంది. జీవన్ ఉత్సవ్ పాలసీ ప్రయోజనాలు ఆకర్షణీయంగా ఉండడంతో, దీనికి చాలా ఆదరణ లభించింది.

పైగా ఈ ప్లాన్ ప్రజల ఆర్థిక అవసరాలను తీర్చే విధంగా రూపొందించబడింది. ఈ పాలసీ ప్రయోజనాలను 65 సంవత్సరాలు వయసు వరకు పొందవచ్చు. కనీసం సమ్ యస్సుర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఐదు లక్షలు అని ప్రకటించింది. దీనికి సంబంధించిన ప్రీమియం కాలం 5 నుండి 16 సంవత్సరాలు ఉంటుంది. ప్రీమియం టర్మ్ పూర్తయిన తర్వాత, ప్రతి ఏడాదికి 10% చొప్పున పాలసీదారులకు జీవితాంతం చెల్లింపు జరుగుతుంది. పాలసీదారులకు వంద సంవత్సరాలు వచ్చే వరకు ఈ చెల్లింపులు అందుబాటులో ఉంటాయి.

ప్రీమియం చెల్లింపు వ్యవధికి అనుగుణంగా వెయిటింగ్ పీరియడ్ మారుతుంది. ఐదు సంవత్సరాల వ్యవధి ఎంపిక చేస్తే, అదనంగా మరో ఐదు సంవత్సరాలు వేచి ఉండాలి. అదే విధంగా, ఆరు సంవత్సరాల టర్మ్ ఎంపిక చేస్తే, వెయిటింగ్ పీరియడ్ నాలుగు సంవత్సరాలుగా ఉంటుంది. ఏడూ సంవత్సరాలు టర్మ్ ప్రీమియం చెల్లిస్తే వెయిటింగ్ పీరియడ్ మూడు సంవత్సరాలుగా ఉంటుంది. ఎనిమిది ఏళ్ల నుంచి పదహారు ఏళ్ల మధ్య ప్రీమియం టర్మ్ ఎంచుకుంటే వెయిటింగ్ పీరియడ్ రెండు సంవత్సరాలు. ఈ విధంగా, పాలసీ వ్యవధికి అనుగుణంగా వెయిటింగ్ పీరియడ్ మారుతుంది అని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news