తెలంగాణ భవన్‌కు తాళం వేసిన పోలీసులు..పరిస్థితి ఉద్రిక్తత ! !

-

గులాబీ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. తెలంగాణ భవన్‌కు తాళం వేసారు పోలీసులు. ఏసీబీ విచారణకు కేటీఆర్ వెళ్లిన వెంటనే.. భవన్‌కు తాళం వేసేసారు పోలీసులు. కేటీఆర్ వెంట ఏసీబీ ఆఫీస్‌కు కార్యకర్తలు వెళ్లకూడదనే ఉద్దేశంతోనే తెలంగాణ భవన్‌కు తాళం వేశారు.

telangaa bhavan
telangaa bhavan

దీంతో.. ఇది ప్రజాస్వామ్యమా? పోలీసుల రాజ్యమా? అంటూ మండిపడుతున్నాయి బీఆర్ఎస్ శ్రేణులు. తెలంగాణ భవన్‌కు తాళం వేయడంతో పరిస్థితి ఉద్రిక్తతగా మారింది. అటు తెలంగాణ భవన్ సమీపంలోని నీలోఫర్ కేఫ్‌ను మూసివేసారు పోలీసులు. కస్టమర్లను బయటకు పంపించేసి.. బీఆర్ఎస్ నేతల్ని అరెస్ట్ చేస్తున్నారు. ప్రజా పాలన అంటే ఇదేనా? అంటూ తీవ్రంగా మండిపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news