కాళేశ్వరంపై బీఆర్ఎస్ పోరుబాట పట్టనుంది. హరీష్ రావు నేతృత్వంలో ఈ నెల 21వ తేదీన బ్యారేజీలు, రిజర్వాయర్ల వద్ద నిరసన, వచ్చే నెలలో తెలంగాణ రాష్ట్ర బంద్, సడక్ బంద్ కు సన్నాహాలు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ పోరుబాటకు సిద్ధమవుతోంది బీఆర్ఎస్.

మేడిగడ్డ బ్యారేజీలో రెండు పిల్లర్ల కుంగుబాటును చూపుతూ మొత్తం ప్రాజెక్టు కూలిందని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు చేస్తున్న విషప్రచారాన్ని తిప్పికొడుతూ, ప్రజలకు వాస్తవాలను తెలియజేసే విధంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది బీఆర్ఎస్ పార్టీ.
పోరుబాట కార్యక్రమంలో భాగంగా స్థానిక రైతులతో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన పంపు హౌసులు, బ్యారేజీలు, రిజర్వాయర్లు సందర్శించనున్నారు బీఆర్ఎస్ నాయకులు. గోదావరి బనకచర్ల ప్రాజెక్టు విషయంలో చంద్రబాబును అడ్డుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు విఫలమైనందుకు ఆ అంశంపై కూడా పోరుబాటకు సన్నాహాలు చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ.