కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ నుండి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు డిశ్చార్జ్ అయ్యారు. రెండు రోజుల క్రితం హై ఫీవర్తో ఆసుపత్రిలో చేరిన హరీష్ రావును నిన్న (మంగళవారం) సాయంత్రం 7 గంటలకు డిశ్చార్జ్ చేశారు.

మరో మూడు, నాలుగు రోజులు ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలని సూచించారు వైద్యులు. అటు నిన్న హరీష్ రావును పరామర్శించారు కేటీఆర్. బేగంపేటలోని కిమ్స్ సన్ షైన్ ఆసుపత్రిలో చేరిన హరీష్ రావును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం రాత్రి పరామర్శించారు. వైరల్ ఫీవర్తో బాధపడుతున్న హరీష్ రావును పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు కేటీఆర్.