మేడ్చల్ జిల్లాలో దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి కన్న తల్లిని కూతురు హతమార్చింది. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. జీడిమెట్లలోని NLB నగర్ లో నివాసం ఉండే తల్లి అంజలిని ప్రియుడితో కలిసి గొంతు నులిమి, ఐరన్ రాడ్ తో తలపై కొట్టి చంపింది పదో తరగతి చదువుతున్న కూతురు తేజశ్రీ (16).

ప్రేమ వ్యవహారంలో మందలించడంతో తల్లిపై కోపం పెంచుకుంది కూతురు తేజ శ్రీ. ప్రియుడు శివ(19), అతని తమ్ముడు యశ్వంత్ (18) తో కలిసి హత్య చేసింది కూతురు. ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు జీడిమెట్ల పోలీసులు.