పవన్ కళ్యాణ్ తల్లికి తీవ్ర అస్వస్థత.. కేబినెట్ కు డుమ్మా !

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఊహించని పరిణామం ఎదురైంది. ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి తల్లి తీవ్ర అనారోగ్యం పాలైనట్లు తెలుస్తోంది. దీంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ విషయం తెలియగానే హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతున్న సంగతి తెలిసిందే.

AP Deputy Chief Minister PAWA KALYAN, PAWA KALYAN mother
AP Deputy Chief Minister PAWA KALYAN, PAWA KALYAN mother

అయితే ముందస్తు సమాచారంతో ఏపీ కేబినెట్ సమావేశానికి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. కానీ మధ్యలోనే ఈ వార్త తెలియడంతో… హుటాహుటిన హైదరాబాద్ వెళ్లారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ వెళ్లినప్పటికీ ఏపీ కేబినెట్ చంద్రబాబు అధ్యక్షతన జరుగుతోంది. ఇవాల్టి కేబినెట్ సమావేశంలో దాదాపు 31 అంశాలు ఏజెండగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో విశాఖలో కాగ్నిజెంట్ ఏర్పాటుకు భూమి కేటాయింపులు చేయబోతున్నారట. అలాగే అమరావతిలో రెండు దశల్లో 44వేల ఎకరాల ల్యాండ్ కూలింగ్కు నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.

 

Read more RELATED
Recommended to you

Latest news