విశాఖపట్నంలో తీవ్ర విషాదం నెలకొంది. మద్యం కారణంగా విశాఖలోని కుటుంబం రోడ్డున పడింది. మద్యం విపరీతంగా… తాగి… ఓ భర్త చేసిన పనికి… కుటుంబం మొత్తం బావిలో పడాల్సి వచ్చింది. ఈ సంఘటన ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖలోని పెందుర్తి సమీపంలో…. పవన్ అలాగే ఆయన భార్య గీత జీవనం కొనసాగిస్తున్నారు. పవన్ అలాగే గీత దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కుమారుడు మణికంఠ కాగా కుమార్తె యోక్షిత.

అయితే పనికి వెళ్లి వచ్చిన తర్వాత కచ్చితంగా పవన్ తాగడం అలవాటు చేసుకున్నాడు. ఆ తర్వాత భార్యతో ప్రతిరోజు గొడవపడేవాడు పవన్. ఆమెను చితక బాదేవాడు. అయితే ఈ నేపథ్యంలోనే పవన్ బాధ భరించలేక ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి బావిలో దూకింది. అయితే స్థానికులు చూసి వెంటనే… ముగ్గురిని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే కుమారుడు మణికంఠ అలాగే తల్లి గీతా మృతి చెందారు. అటు కుమార్తె యోక్షిత.. మాత్రం బతికి బయటపడింది. ఈ సంఘటనపై పెందుర్తి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.