Rishabh Pant Leeds Test: టీమిండియా యంగ్ క్రికెటర్ రిషబ్ పంతుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ షాక్ ఇచ్చింది. అతను చేసిన పనికి… సీరియస్ అయింది ఐసీసీ. ఐసీసీ ప్రవర్తన నియమాలిని… ఉల్లంఘించినందుకు గాను టీమిండియా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ ను ఐసీసీ మందలించింది. మందలించడంతోపాటు ఒక డీమెరిడ్ పాయింట్ విధించింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్.

తొలి టెస్ట్ మూడో రోజు ఇంగ్లాండు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో… బాల్ కండిషన్ బాగాలేదని.. వెంటనే బంతిని మార్చాలని.. ఫీల్డ్ అంపైర్ ను కోరాడు పంత్. అయితే బంతిని చెక్ చేసిన అంపైర్… రైఫిల్ బాల్ మార్చేందుకు ఒప్పుకోలేదు. దీంతో అంపైర్ నిర్ణయం పై… రిషబ్ పంత్ చాలా సీరియస్ అయ్యాడు. బంతిని నేలకు కొట్టి అక్కడి నుంచి వెళ్ళాడు. అయితే దీనిపై ఐసీసీ తాజాగా సీరియస్ అయింది.