టాలీవుడ్ ఇండస్ట్రీలో.. రాంగోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రాంగోపాల్ వర్మ. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు ఒక ఊపు ఊపారు రాంగోపాల్ వర్మ. అయితే కూటమి ప్రభుత్వం రాగానే ఆయనపై అనేక రకాల కేసులు రావడంతో… సోషల్ మీడియాలో కాస్త సైలెంట్ అయిపోయారు వర్మ.

అయితే అలాంటి వర్మ దర్శకత్వంలో నటించిన ఓ హీరోయిన్ సన్యాసిగా మారింది. బాలీవుడ్ నటి బర్ఖా మదన్ హిమాలయ పర్వత ప్రాంతంలోని బౌద్ధాశ్రమంలో నివసిస్తూ ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతున్నారు.
ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో మోడల్గా కెరీర్ ప్రారంభించారు బర్ఖా మదన్… అయితే 1996 సంవత్సరంలో అక్షయ్ కుమార్… కిలాడియో0క్రా కిలాడి సినిమాలో వెండితెరకు ఆమె పరిచయమయ్యారు. ఆ తర్వాత చాలా హిందీ సినిమాలలో నటించి అందరిని మెప్పించారు. ఇక 23 సంవత్సరంలో వర్మ దర్శకత్వంలో హారర్ బూత్ సినిమాలో నటించి అందరిని ఆకట్టుకున్నారు. అయితే అలాంటి బాలీవుడ్ నటి బర్ఖా మదన్ ఇప్పుడు సన్యాసం తీసుకున్నారు.