ఏపీ మాజీ సీఎం జగన్ పై కేసుల పరంపర కొనసాగుతోంది. తాజాగా జగన్ గుంటూరు మిర్చి యార్డు పర్యటనపై కేసు నమోదు అయింది. జగన్తో పాటు పలువురు వైసీపీ నేతలపై కేసు నమోదు అయింది. వైసీపీ నేతలు కావటి మనోహర్, అప్పిరెడ్డి, మోదుగుల.. అంబటి రాంబాబుతో పాటు పలువురికి నోటీసులు కూడా ఇచ్చారు.

నల్లపాడు పోలీస్ స్టేషన్ లో విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. ఇక అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి సింగయ్య అనే వ్యక్తి మరణించాడు. ఈ కేసులో గుంటూరు పోలీసులు కొత్త సెక్షన్లను నమోదు చేశారు. తోలుత BNS 106(1) సెక్షన్ కింద నిర్లక్ష్యం వల్ల మరణానికి కారణమయ్యారని కేసు పెట్టగా…. తాజాగా BNS 105, 49 సెక్షన్లను జోడించారు. హత్య కిందికి రాని నేర విషయాల్లో BNS 105ని వాడుతారు. హత్య చేసినట్లుగా నిరూపణ అయితే జీవిత ఖైదు/5-10 సంవత్సరాలు జైలు శిక్షతో పాటు ఫైన్ కూడా విధించే అవకాశాలు ఉన్నాయి. ఇది నాన్ బెయిలబుల్ నేరానికి ప్రేరేపించారంటూ BNS 49 సెక్షన్ పెట్టారు.