లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమ్ ఇండియా దారుణంగా ఓడిపోయింది. ఈ మ్యాచ్లో టీమిండియా పై ఏకంగా ఐదు వికెట్ల తేడాతో గ్రాండ్ వికెట్ కొట్టింది ఇంగ్లాండ్ టీం. ముందుగా అందరూ ఊహించినట్లుగానే.. చివరి రోజు టీమిండియా చేతులెత్తేసింది. క్యాచ్లు, బౌలింగ్ ఇలా అన్ని విభాగాల్లో దారుణంగా విఫలమైంది టీమిండియా.

ఈ తరుణంలోనే 148 సంవత్సరాల చెత్త రికార్డును కూడా నమోదు చేసుకుంది టీమిండియా. ఈ మ్యాచ్లో ఐదుగురు టీమిండియా ఆటగాళ్లు సెంచరీ చేసిన కూడా ఓడిపోయింది. ఇలా జరగడం 148 సంవత్సరాల తర్వాత అని రికార్డులు చెబుతున్నాయి. కాగా ఈ మ్యాచ్లో రిషబ్ పంత్ రెండు సెంచరీలు చేయగా.. కేఎల్ రాహుల్, గిల్ అలాగే యశస్వి జైస్వాల్ తలో సెంచరీ చేశారు.