వైసిపి పార్టీ బహిష్కృత లీడర్, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వల మాధురి ఇద్దరు దండలు మార్చుకున్నారు. వాళ్ళ ఇద్దరి పెళ్లి జరిగి సంవత్సరం గడిచినట్లు… పేర్కొంటూ మొదటి యానివర్సరీ చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ఈ సందర్భంగా దువ్వాడ శ్రీనివాస్ అలాగే మాధురి ఇద్దరు కేక్ కట్ చేసి దండలు మార్చుకున్నారు.

దువ్వాడ శ్రీనివాస్ అనుచరుల సమక్షంలోనే వీళ్ళ యానివర్సరీ.. కార్యక్రమం నిర్వహించుకున్నారు. ఇది ఇలా ఉండగా దువ్వాడ శ్రీనివాస్ వయసు 50 సంవత్సరాలకు పైగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఆయన మొదటి భార్య… ఇద్దరూ పిల్లలను వదిలేసి మరి మాధురిని పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం మాధురి వయసు 28 సంవత్సరాలు మాత్రమే అని సమాచారం. అయితే భార్యా పిల్లలను వదిలేసి మరి… మాధురి కట్టించిన ఇంట్లోనే దువ్వాడ శ్రీనివాస్ ఉంటున్నాడు. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి… పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
దువ్వాడ శ్రీనివాస్ వివాహ వార్షికోత్సవం..
దండలు మార్చుకుని కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్న దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి pic.twitter.com/dgM35vQyqn
— BIG TV Breaking News (@bigtvtelugu) June 26, 2025