రైలు పట్టాలపై కారు నడిపిన యువతి కేసులో ట్విస్ట్ !

-

శంకర్‌పల్లిలో రైలు పట్టాలపై కారు నడిపిన యువతి రవికా సోని కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. శంకర్‌పల్లిలో రైలు పట్టాలపై కారు నడిపిన యువతి రవికా సోనిని ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రికి తరలించారు. అదుపులోకి తీసుకున్న సమయంలో పోలీసులపై దాడి చేశారు యువతి.

CAR
Twist in the case of the young woman who drove a car on the train tracks

శంకర్‌పల్లి, రైల్వే పీఎస్‌లో యువతిపై కేసు నమోదు అయింది. చికిత్స తర్వాత విచారణకు హాజరుకావాలన్నారు పోలీసులు.

కాగా రీల్స్ కోసమే యువతి… రైల్వే ట్రాక్ పై కారు నడిపిన చెబుతున్నారు. యువతి లక్నోకు చెందిన రభిక సోనీగా గుర్తించారు. పోలీసుల విచారణకు సహకరించని రభిక సోనీని అరెస్ట్ చేశారు. యువతి మద్యం మత్తులో ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news