హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల అప్రమత్తతో రెండు ప్రాణాలు సురక్షితంగా బయటపడ్డాయి. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి . మేడ్చల్లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్టీసీ బస్సుని ఢీ కొట్టింది బైక్. తాడ్బండ్ దర్శనానికి శివ(19), భాను(22) వెళ్తున్న టైంలో ఈ ఘటన జరిగింది.

బస్సు యూటర్న్ తీసుకుంటుండగా.. వేగంగా వచ్చి దాన్ని ఢీకొట్టింది బైక్. ఈ ప్రమాదం గురించి తెలిసి.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. ఈ ఘటనలో గాయపడిన ఇద్దరిని.. వెంటనే ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ప్రస్తుతం ఆ ఇద్దరి పరిస్థితి క్షేమంగా ఉందని తెలిపారు అధికారులు.
రోడ్డు ప్రమాదం.. పోలీసుల అప్రమత్తతో రెండు ప్రాణాలు సురక్షితం
మేడ్చల్లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్టీసీ బస్సుని ఢీకొన్న బైక్
తాడ్బండ్ దర్శనానికి శివ(19), భాను(22) వెళ్తున్న టైంలో జరిగిన ఘటన
బస్సు యూటర్న్ తీసుకుంటుండగా.. వేగంగా వచ్చి దాన్ని ఢీకొట్టిన బైక్
ప్రమాదం… pic.twitter.com/87R88YYfpk
— PulseNewsBreaking (@pulsenewsbreak) June 28, 2025