విజయ్ దేవరకొండ, హీరో రానాతో పాటు టాలీవుడ్ ప్రముఖులపై కేసు నమోదు అయ్యింది. బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. 29 మంది సినీ సెలబ్రిటీలతో పాటు పలు కంపెనీలపై ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. హీరో విజయ్ దేవరకొండ, రానా, మంచు లక్ష్మి, ప్రకాశ్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, శ్రీముఖిలపై ఈడీ కేసు నమోదు చేసింది.

హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసు నమోదు చేశారు. సెలబ్రిటీలు, యూట్యూబర్స్, ఇన్ఫ్లూయెన్సర్లను పీఎంఎల్ఏ కింద విచారించనున్నారు.