Tamil Nadu Train Massive Fire : తమిళనాడు రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. గూడ్స్ రైలులో భారీ అగ్ని ప్రమాదం జరగగా.. మంటలు ఎగిసిపడుతున్నాయి. తమిళనాడు రాష్ట్రం తిరువల్లూరు సమీపంలో గూడ్స్ రైలులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆయిల్ తరలిస్తున్న ట్యాంకర్ రైలులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఫైర్ యాక్సిడెంట్ జరగగానే 8 భోగి లకు మంటలు వ్యాపించాయి. మొత్తం 52 భోగిల ఆయిల్ టాంకర్లు కలిగి ఉన్న రైలుకు ఈ ప్రమాదం జరిగింది. ఇప్పటికే ఎనిమిది బోగీలు బుగ్గి పాలయ్యాయి. మిగతా భోగిలలో కూడా ఆయిల్ ఉండటంతో మండల ఆర్పేందుకు పది ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగాయి. ఈ ప్రమాదంలో కోట్లల్లో ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.
తమిళనాడు – తిరువళ్లూరు సమీపంలో గూడ్స్ రైలులో భారీ అగ్నిప్రమాదం
ఆయిల్ తరలిస్తున్న ట్యాంకర్ రైలులో ప్రమాదం
8 బోగీలకు వ్యాపించిన మంటలు.. 52 బోగీల ఆయిల్ ట్యాంకర్లు కలిగి ఉన్న రైలు
మిగతా బోగీల్లో కూడా ఆయిల్ ఉండడంతో, మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్న 10కి పైగా ఫైర్ ఇంజిన్లు https://t.co/HmkyRAd7j2 pic.twitter.com/sFab4v9CVW
— Telugu Scribe (@TeluguScribe) July 13, 2025