నేటి నుంచి అమల్లోకి ఉచిత బస్సు ప్రయాణం…ఈ సర్వీస్ లలో నో ఛాన్స్ !

-

ఏపీలో నేటి నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభం కానుంది. స్త్రీ శక్తి పేరుతో అమలు చేసే ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించిన తర్వాత జీరో ఫేర్ టికెట్ల జారీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. విజయవాడ PN బస్టాండ్ లో ఇవాళ సాయంత్రం ఐదు గంటల సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభిస్తారు. కాగా, నాన్ స్టాప్, ఇతర రాష్ట్రాలకు వెళ్లే, పర్యాటక, సూపర్ లగ్జరీ, సప్తగిరి, తిరుమల, అల్ట్రా డీలక్స్, స్టార్ లైనర్, ఏసీ బస్సులలో స్త్రీ శక్తి పథకం వర్తించదు.

Free bus, rtc, ap,
Free bus travel to be implemented from today

ఆగస్టు 15 నుంచి ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని చంద్రబాబు నాయుడు గతంలోనే వెల్లడించారు. ఇచ్చిన మాట ప్రకారం నేటి నుంచి స్త్రీ శక్తి పథకాన్ని అమలులోకి తీసుకువస్తున్నారు. దీంతో ఏపీలోని మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి చార్జీలు లేకుండా ఇతర ప్రదేశాలకు చేరుకోవచ్చని చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news