గురుకులలో ఎలుకల కలకలం రేపాయి. ముగ్గురు విద్యార్థులపై ఎలుకలు దాడి చేశాయి. అయితే ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం అలంపూర్లోని గురుకులలో ఈ సంఘటన జరిగింది. విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు.

ప్రస్తుతం విద్యార్థులు క్షేమంగా ఉన్నారు. ఈ సమస్యలు పరిష్కరించాలని రోడ్డెక్కి కలెక్టరేట్ కు పాదయాత్ర కూడా చేశారు. అయితే ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.