ఎర్రకోటలో భారీ చోరీ చోటు చేసుకుంది. రూ.కోటి విలువైన కలశాలు మాయం అయ్యాయి. ఇటీవల ఎర్రకోటలో జరిగిన ఓ మతపరమైన కార్యక్రమంలో రూ.కోటి విలువ చేసే రెండు కలశాలు చోరీ చేశారు.
ఇక ఈ సంఘటనకు సంబంధించిన చోరీ దృశ్యాలు… సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

ఇప్పుడు ఆ వీడియోలు… సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కలశాలు చోరీ చేసిన నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేస్తున్నారు. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.