తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర విషాదం నెలకొంది. వాగులో పడి తల్లితో పాటు ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. కొమురం భీం జిల్లాలోని వాంకిడి మండలంలో ఈ ఘటన జరిగింది. ఎరువుల బస్తాలు కడిగేందుకు ముగ్గురు పిల్లలతో చికిలి వాగుకి వెళ్లింది భుజిబాయి (35).

ఈ తరుణంలోనే… ఆడుకుంటూ చిన్నకూతురు వాగులో కొట్టుకుపోవడంతో.. కాపాడేందుకు వెళ్లింది తల్లి.
ఈ క్రమంలోనే మరో ఇద్దరు వాగులో గల్లంతు అయ్యారు. దీంతో తల్లితో పాటు ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఈ సంఘటన ఇప్పుడు తెలంగాణ రాష్ట్రఃలో పెను విషాదంగా మారింది.