డ్రగ్స్ తయారీకి డెన్ గా చిన్న పిల్లల స్కూల్ మారింది. అల్ఫాజోలం తయారీ కేంద్రంగా బోయిన్ పల్లి మేధా స్కూల్ ను తయారు చేశారు. క్లాస్ రూమ్ లను డ్రగ్స్ తయారీ కేంద్రాలుగా మార్చేశారు స్కూల్ డైరెక్టర్ జయ ప్రకాష్ గౌడ్, మరో ఇద్దరు. 10 గంటలుగా ఈగల్ టీమ్ సోదాలు కొనసాగుతున్నాయి.

8 రియాక్టర్స్, 8 డ్రయ్యర్స్ సీజ్ అయ్యాయి. పెద్ద ఎత్తున కెమికల్స్ డబ్బాలు స్వాధీనం చేసుకున్నారు. జయ ప్రకాశ్ నుంచి రూ. 20 లక్షల నగదు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. సోమవారం నుండి శనివారం వరకు డ్రగ్స్ తయారీ.. ఆదివారం డెలివరీ చేస్తున్నారు. 130 మంది పిల్లలు ఉండే పాఠశాలలో గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ తయారీ చేస్తున్నారు. తయారు చేసిన డ్రగ్స్ ఎవరెవరికి విక్రయించారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు ఈగల్ పోలీసులు.