ప్రతిరోజూ జరిగే మిరాకిల్స్‌తో పేరు గాంచిన 5 అద్భుత దేవాలయాలు!

-

మన దేశంలో అనేక దేవాలయాలు ఉన్నప్పటికీ, కొన్ని మాత్రమే ప్రతిరోజూ అద్భుతాలను చూపిస్తాయి. భక్తులను ఆశ్చర్యానికి గురిచేసే ఈ వింతలు సైన్స్ కి అర్థంకానీ కేవలం విశ్వాసం ద్వారా మాత్రమే అర్థమయ్యే విషయాలు.మరి వాటి గురించి  తెలుసుకోవాలా, అవి ఏవి? అయితే ఈ నిత్య అద్భుతాలు జరిగే 5 ప్రముఖ భారతీయ దేవాలయాల గురించి తెలుసుకుందాం..

భారతదేశం ఆధ్యాత్మిక శక్తికి కేంద్రం. ఇక్కడి కొన్ని ఆలయాలు కేవలం భక్తి కేంద్రాలు మాత్రమే కాదు అంతుచిక్కని రహస్యాల నిలయాలు. ప్రతిరోజూ ఏదో ఒక అద్భుతం జరుగుతూనే ఉంటుందని భక్తులు బలంగా నమ్ముతారు. అలాంటి 5 ప్రముఖ దేవాలయాల వివరాలు తెలుసుకుందాం.

జగన్నాథ దేవాలయం, పూరి (ఒడిశా): ఈ ఆలయం అనేక మిస్టరీలకు ప్రసిద్ధి. ఇక్కడ కొన్ని నియమాలు ప్రకృతి నియమాలకు విరుద్ధంగా పనిచేస్తాయి. ఉదాహరణకు, ఆలయ గోపురం నీడ ఎప్పుడూ నేలపై పడదు. అలాగే గాలి వీచే దిశకు వ్యతిరేకంగా ఆలయ శిఖరంపై ఉన్న జెండా ఎగురుతుంది.

స్తంభేశ్వర్ మహాదేవ్, గుజరాత్: ఈ శివాలయం సముద్ర గర్భంలో దాగుంటుంది. రోజులో కొన్ని గంటలు మాత్రమే టువా సముద్రం పోటు వచ్చినప్పుడు ఆలయం పూర్తిగా నీటిలో మునిగిపోయి, పోటు తగ్గక మళ్లీ బయటకు కనిపిస్తుంది. శివలింగాన్ని దర్శించుకోవడానికి భక్తులు నీరు తగ్గిన సమయం కోసం వేచి ఉండాల్సిందే.

5 Amazing Temples Known for Daily Miracles You Must Visit
5 Amazing Temples Known for Daily Miracles You Must Visit

వీరభద్ర దేవాలయం, లేపాక్షి (ఆంధ్రప్రదేశ్): ఈ ఆలయంలోని వేలాడే స్తంభం (Hanging Pillar) ఒక ఇంజనీరింగ్ అద్భుతం. 70 స్తంభాలలో ఒకటి నేలకు తగలకుండా గాలిలో వేలాడుతూ ఉంటుంది. భక్తులు ఆ స్తంభం కింద నుంచి వస్త్రాన్ని తీసి అద్భుతాన్ని అనుభవిస్తారు.

మీహందిపూర్ బాలాజీ, రాజస్థాన్: ఈ దేవాలయం భూత, ప్రేత బాధలను తొలగించడంలో పేరుగాంచింది. ఇక్కడ నిత్యం దెయ్యాలు వదిలించబడతాయని, దుష్టశక్తులు నశించిపోతాయని భక్తులు నమ్ముతారు. ఇక్కడి పూజలు చాలా కఠినంగా, విచిత్రంగా ఉంటాయి.

నిధివన్ దేవాలయం, బృందావన్ (ఉత్తరప్రదేశ్): ఇక్కడ ఇప్పటికీ ప్రతి రాత్రి శ్రీకృష్ణుడు రాసలీల చేస్తాడని బలంగా నమ్ముతారు. సూర్యాస్తమయం తర్వాత ఆలయాన్ని మూసివేస్తారు ఎవరూ లోపలికి వెళ్లడానికి అనుమతించరు. రాత్రి వేళల్లో ఆలయంలోపల పడుకునే భక్తులు పిచ్చివాళ్లవుతారని లేదా చనిపోతారని ప్రతీతి.

ఈ దేవాలయాల్లో జరిగే మహిమలు మనకు అంతుచిక్కని విషయాలు కావచ్చు, కానీ భక్తుల విశ్వాసం ముందు అన్నీ తలవంచాల్సిందే. ఈ ఆలయాలు మన సంస్కృతి, ఆధ్యాత్మికత ఎంత లోతైనవో తెలియజేస్తాయి. ఈ అద్భుతాలను ఒక్కసారైనా నేరుగా చూడటం ఒక గొప్ప అనుభూతిని ఇస్తుంది.

గమనిక: పైన పేర్కొన్న విషయాలు పురాణాలు, వాస్తు శాస్త్రం మరియు స్థానిక విశ్వాసాలపై ఆధారపడినవి. వీటిని కేవలం ఆధ్యాత్మిక విషయాలుగా పరిగణించాలి.

Read more RELATED
Recommended to you

Latest news