ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధం: బాబా వంగ భయానకమైన పురాణభవిష్యవాణి నిజంగా నిజమవుతొందా ?

-

ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో రాజుకుంటున్న ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలు ప్రపంచాన్ని మరో ప్రపంచ యుద్ధం వైపు నెడుతున్నాయా అన్న ఆందోళన కలిగిస్తున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో, బల్గేరియాకు చెందిన అంధ ప్రవక్త బాబా వంగ గతంలో చెప్పిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అగ్రరాజ్యాల మధ్య ఘర్షణలు, వినాశకరమైన ఆయుధాల ప్రయోగం గురించి ఆమె చేసిన హెచ్చరికలు ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతున్నాయని చాలామంది నమ్ముతున్నారు.

బాబా వంగ అనుచరుల ప్రకారం, ఆమె 2024- 2026 మధ్య కాలంలో ఐరోపా మరియు మధ్యప్రాచ్య ప్రాంతాల్లో పెద్ద ఎత్తున యుద్ధ జ్వాలలు ఎగిసిపడతాయని అంచనా వేశారు. ముఖ్యంగా ఒక పెద్ద ముస్లిం దేశంపై జరిగే దాడి, అది ప్రపంచవ్యాప్త ఘర్షణకు దారితీస్తుందని ఆమె సూచనప్రాయంగా చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఇజ్రాయెల్ మరియు ఇరాన్ వంటి శక్తివంతమైన దేశాల మధ్య ప్రత్యక్ష దాడులు మొదలవ్వడం ఈ మాటలకు బలం చేకూరుస్తోంది.

Did Baba Vanga Predict the Israel–Iran Conflict? Fact vs Myth
Did Baba Vanga Predict the Israel–Iran Conflict? Fact vs Myth

ఈ యుద్ధం కేవలం రెండు దేశాలకే పరిమితం కాకుండా, రసాయన లేదా జీవ ఆయుధాల వాడకానికి దారితీయవచ్చని ఆమె హెచ్చరించినట్లు కథనాలు ఉన్నాయి. ఒకవేళ ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పూర్తిస్థాయి యుద్ధం మొదలైతే, అది అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యా వంటి దేశాలను కూడా రణరంగంలోకి లాగుతుంది. ఇదే జరిగితే బాబా వంగ చెప్పినట్లుగా యూరప్ శ్మశానంగా మారుతుందన్న మాటలు నిజమవుతాయేమోనని విశ్లేషకులు భయపడుతున్నారు.

ప్రస్తుత ఆధునిక సాంకేతిక యుగంలో ఇలాంటి భవిష్యవాణిలను కొట్టిపారేసే వారు ఉన్నప్పటికీ, గతంలో ఆమె చెప్పిన ‘సెప్టెంబర్ 11 దాడులు’, ‘సునామీ’ వంటి సంఘటనలు నిజమవ్వడంతో ప్రజల్లో ఒక రకమైన భయం నెలకొంది. చరిత్ర గతిని మార్చేసే ఈ యుద్ధ మేఘాలు బాబా వంగ చెప్పిన వినాశనానికి సంకేతాలా? లేక శాంతి చర్చలతో ఈ ముప్పు తప్పుతుందా? అనేది కాలమే నిర్ణయించాలి అంటున్నారు నిపుణులు..

 

Read more RELATED
Recommended to you

Latest news