నాగులూరు గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం : ఎంపీ ఈటల రాజేందర్

-

దుండిగల్, జూలై 12: దుండిగల్ మండలంలోని నాగులూరు గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న పలు మౌలిక సమస్యల పరిష్కారం కోసం మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు శ్రీ ఈటల రాజేందర్ గారికి గ్రామ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు.

వినతిపత్రాన్ని స్వీకరించిన ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ, ఇటీవల నాగులూరు గ్రామంలో పర్యటించిన సందర్భంగా అక్కడి సమస్యలను స్వయంగా పరిశీలించానని, గ్రామ పరిస్థితులపై తనకు స్పష్టమైన అవగాహన ఉందని తెలిపారు. నాగులూరు–రాయలాపూర్ రహదారి, బస్‌స్టాప్‌తో పాటు ఇతర మౌలిక సదుపాయాల సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులతో సమన్వయం చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

అదేవిధంగా, నాగులూరు గ్రామానికి రేషన్ షాప్ మంజూరు చేయడం, స్మశాన వాటిక ఏర్పాటు చేయడం కోసం జిల్లా కలెక్టర్‌కు లేఖ రాసి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో దుండిగల్ సర్కిల్ బీజేపీ నాయకులు రాజ్ కుమార్, నాగేంద్ర బాబు, నాగులూరు గ్రామస్థులు తుడుం మధు, సాయి కుమార్, హరీష్, దుర్గాప్రసాద్, శ్రవణ్, అబ్దుల్, సిద్దు తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news