కేరళలో ప్రమాదకర ఇన్ఫెక్షన్.. లక్షణాలు ,నివారణ జాగర్తలు!

-

ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు భయపెడుతుంటే, మరోవైపు ఒక భయంకరమైన బాక్టీరియా పడగ విప్పడం ఆందోళన కలిగిస్తోంది. కేరళలోని కోళికోడ్ జిల్లాలో ‘షిగెల్లా’ అనే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వేగంగా విస్తరిస్తూ పసిపిల్లల ప్రాణాలను బలితీసుకుంటోంది. మనం రోజూ తాగే నీరు, తినే ఆహారం ఎంత స్వచ్ఛంగా ఉండాలో ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది. అజాగ్రత్తగా ఉంటే ఏ క్షణమైనా ఇతర ప్రాంతాలకు వ్యాపించే అవకాశం ఉన్న ఈ ప్రాణంతక వ్యాధి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

 బాక్టీరియా మన శరీరంలోకి ఎలా ప్రవేశిస్తుంది?: షిగెల్లా అనేది ప్రధానంగా కలుషితమైన ఆహారం మరియు నీటి ద్వారా వ్యాపిస్తుంది. బహిరంగ ప్రదేశాల్లో దొరికే అపరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం లేదా కలుషితమైన బావి నీరు తాగడం వల్ల ఈ బాక్టీరియా నేరుగా మన పేగుల్లోకి చేరుతుంది. ముఖ్యంగా మలమూత్ర విసర్జన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోకపోవడం వల్ల ఇది ఒకరి నుంచి మరొకరికి వేగంగా విస్తరిస్తుంది. ఇక చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు అపరిశుభ్రమైన చేతులను నోట్లో పెట్టుకోవడం కూడా ఈ ఇన్ఫెక్షన్‌కు ప్రధాన కారణం.

తీవ్రమైన కడుపు నొప్పి: పేగుల్లో ఇన్ఫెక్షన్ వల్ల తట్టుకోలేని నొప్పి వస్తుంది. రక్త విరేచనాలు, మోషన్స్‌లో రక్తం పడటం ఈ వ్యాధి ప్రధాన లక్షణం.

“Health Alert! Rising Infection in Kerala – Signs, Risks & Safety Tips”
“Health Alert! Rising Infection in Kerala – Signs, Risks & Safety Tips”

జ్వరం & వాంతులు: బాక్టీరియా ప్రభావంతో శరీరం వేడెక్కి, విపరీతమైన నీరసం వస్తుంది.
సకాలంలో చికిత్స అందకపోతే శరీరం డీహైడ్రేషన్‌కు గురై ప్రాణాపాయం సంభవించవచ్చు.

చిన్నపిల్లల మీద పంజా ఎందుకు?: ఈ బాక్టీరియా ఎవరికైనా రావచ్చు, కానీ ఐదేళ్లలోపు పిల్లలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. వారి రోగనిరోధక శక్తి ఇంకా అభివృద్ధి చెందే దశలో ఉండటంతో, ఈ బాక్టీరియా పేగుల గోడలను వేగంగా దెబ్బతీస్తుంది. స్కూళ్లకు, అంగన్‌వాడీలకు వెళ్లే పిల్లల విషయంలో తల్లిదండ్రులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి.

చేతుల పరిశుభ్రత: ఆహారం తినే ముందు, వాష్ రూమ్ నుంచి వచ్చిన తర్వాత చేతులను కనీసం 20 సెకన్ల పాటు సబ్బుతో కడుక్కోవాలి.

నీటిని కాచి చల్లార్చండి: ఎల్లప్పుడూ నీటిని మరిగించి చల్లార్చిన తర్వాతే తాగడం సురక్షితం. పండ్లు, కూరగాయలు: పచ్చి కూరగాయలను ఉప్పు నీటితో శుభ్రం చేసిన తర్వాతే వాడుకోవాలి.

కేరళలో చోటుచేసుకున్న ఈ ఘటన మనందరికీ ఒక హెచ్చరిక. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా షిగెల్లా వంటి వ్యాధులను సులభంగా జయించవచ్చు. మన నిర్లక్ష్యం ఇంకొకరి ప్రాణం మీదకు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. పరిశుభ్రమైన అలవాట్లతో మనల్ని మరియు మన పిల్లలను కాపాడుకుందాం.

గమనిక: మీ ఇంట్లో ఎవరికైనా వరుసగా విరేచనాలు అవుతున్నా లేదా కడుపు నొప్పితో బాధపడుతున్నా, వెంటనే డాక్టరును సంప్రదించండి. సొంత వైద్యం అస్సలు వద్దు!

Read more RELATED
Recommended to you

Latest news