ఈ మధ్య కాలం లో కొంతమంది నైట్ షిఫ్ట్ వర్క్ ఫ్రొం హోమ్ చేసేవాళ్ళు రాత్రి మొత్తం లైట్ ఆన్ చేసి పెడుతుంటారు .కొందరు రాత్రి పూట బెడ్ రూమ్లో లైట్ ఆన్ చేసి నిద్రపోయే వాళ్ళు వుంటారు. అయితే ఇలాంటి అలవాట్లు మీకు ఉంటే, మీరు ప్రమాదంలో పడినట్లేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చీకట్లో ప్రశాంతంగా నిద్రపోవాల్సిన సమయంలో, చిన్న వెలుతురు ఉన్నా అది మన మెదడును గుండెను తీవ్రంగా దెబ్బతీస్తుందట. కేవలం ఒక చిన్న లైట్ వెలుతురు వల్ల నిద్రలోనే హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. అస్సలు లైట్లు వేసుకుని పడుకుంటే లోపల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
మెదడును గందరగోళపరిచే వెలుతురు: మనం కళ్లు మూసుకుని పడుకున్నప్పటికీ గదిలో ఉండే లైట్ వెలుతురు మన కనురెప్పల ద్వారా లోపలికి చేరుతుంది. దీనివల్ల శరీరం నిద్రపోతున్నా మెదడు మాత్రం ఇంకా పగలే అనుకుని యాక్టివ్గా ఉండిపోతుంది. ఇది మెదడు యొక్క సహజమైన విశ్రాంతి ప్రక్రియను పూర్తిగా పాడు చేస్తుంది.

ధమనులపై పడే ఒత్తిడి: ఈ చిన్న వెలుతురు వల్ల మెదడు యాక్టివేట్ అవ్వడం వల్ల, శరీరంలోని రక్తనాళాలు (ధమనులు) సంకోచిస్తాయి. దీనివల్ల రక్త ప్రసరణ వేగం అసాధారణంగా పెరుగుతుంది. ఇక అదే సమయంలో మన శరీరం రాత్రి పూట చేయాల్సిన సాధారణ జీవక్రియల వేగం మందగించి, హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది.
గుండెకు పొంచి ఉన్న ముప్పు: తీవ్రమైన రక్త ప్రసరణ కారణంగా గుండెపై విపరీతమైన ఒత్తిడి పడుతుంది. ఇది గుండె కొట్టుకునే వేగాన్ని పెంచి బీపీని కూడా పెంచుతుంది. ఇక ఈ మార్పుల వల్ల నిద్రలోనే పక్షవాతం (స్ట్రోక్) లేదా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని కొన్నిసార్లు ఇది ప్రాణాలకే ముప్పుగా మారుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
మంచి నిద్ర కావాలంటే గది చీకటిగా ఉండటం చాలా ముఖ్యం. రాత్రి పూట జీరో బల్బులు, నైట్ లైట్లు లేదా మొబైల్ స్క్రీన్ వెలుతురు లేకుండా చూసుకోవాలి. చీకటి గదిలో నిద్రపోవడం వల్ల గుండె, మెదడు ప్రశాంతంగా ఉండి, ఉదయానికి మనం పూర్తి ఎనర్జీతో నిద్ర లేవగలుగుతాం.
