డిసెంబర్ 31 వరకు ఫ్రీ.. ఆధార్ ఈమెయిల్ అప్‌డేట్‌పై గుడ్ న్యూస్

-

భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు ఎంత ముఖ్యమైనదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బ్యాంక్ అకౌంట్ల నుండి ప్రభుత్వ పథకాల వరకు అన్నింటికీ ఆధార్ లింక్ తప్పనిసరి అయిపోయింది. ఈ క్రమంలోనే ఆధార్‌ను జారీ చేసే ప్రభుత్వ సంస్థ యుఐడీఏఐ (UIDAI) వినియోగదారులకు ఒక అదిరిపోయే ఊరట కలిగించే వార్తను అందించింది. ఆధార్‌తో ఈమెయిల్ ఐడీని అప్‌డేట్ చేసుకోవడానికి ఒక స్పెషల్ ఆఫర్‌ను ప్రకటించింది.

6 నెలల పాటు రూపాయి ఖర్చు లేకుండా: ప్రస్తుతం మన ఆధార్ కార్డులో ఈమెయిల్ ఐడీని అప్‌డేట్ చేసుకోవాలంటే వినియోగదారులు కొంత రుసుము చెల్లించాల్సి వస్తోంది. ఇక అధికారిక ఆధార్ మొబైల్ యాప్ ద్వారా ఈ మార్పులు చేయడానికి ప్రస్తుతం రూ.75 ఛార్జీగా వసూలు చేస్తున్నారు. అయితే, ప్రజలకు మరింత మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ ఛార్జీని రాబోయే 6 నెలల పాటు పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు UIDAI అధికారికంగా వెల్లడించింది.

Update Your Aadhaar Email for Free Before December 31
Update Your Aadhaar Email for Free Before December 31

వచ్చే నెల 1 నుంచే అమలు: ఈ సరికొత్త ఉచిత సేవలు వచ్చే నెల 1వ తేదీ నుండి అందుబాటులోకి రానున్నాయి. వచ్చే నెల 1 నుండి ప్రారంభమై ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు వినియోగదారులు ఉచితంగా తమ ఈమెయిల్ ఐడీని ఆధార్‌తో లింక్ చేసుకోవచ్చు లేదా అప్‌డేట్ చేసుకోవచ్చు. ఇక అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈ ఫ్రీ ఆఫర్ కేవలం ఆధార్ అధికారిక మొబైల్ యాప్ ద్వారా చేసే అప్‌డేట్‌లకు మాత్రమే వర్తిస్తుంది.

ఈమెయిల్ లింక్ చేయడం వల్ల లాభాలివే: ఆధార్ కార్డుతో మొబైల్ నెంబర్‌తో పాటు ఈమెయిల్ ఐడీని కూడా లింక్ చేసి ఉంచడం చాలా మంచిదని అధికారులు చెబుతున్నారు. ఇక ఇలా చేయడం వల్ల మీ ఆధార్ కార్డుకు సంబంధించిన ప్రతి చిన్న అప్‌డేట్ (ఓటీపీలు, లాగిన్ అలర్ట్స్, అథెంటికేషన్ హిస్టరీ) ఎప్పటికప్పుడు మీ ఈమెయిల్ ఐడీకి మెసేజ్ రూపంలో వచ్చేస్తుంది. దీనివల్ల మీ ఆధార్ మరింత సురక్షితంగా ఉంటుంది.

ఇప్పటివరకు మీ ఆధార్ కార్డుకు ఈమెయిల్ ఐడీని లింక్ చేయకపోతే, UIDAI కల్పించిన ఈ సువర్ణ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. డిసెంబర్ 31 లోపు మీ మొబైల్ నుంచే ఉచితంగా ఈ పనిని పూర్తి చేసుకోండి. ఈ సమాచారాన్ని మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు కూడా షేర్ చేసి, వారు కూడా ఈ ఫ్రీ సర్వీస్‌ను వాడుకునేలా సహాయపడండి.

గమనిక : ఈ ఉచిత సేవ కేవలం ఆధార్ మొబైల్ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తుంది. ఒకవేళ మీరు నేరుగా మీ ఆధార్ కేంద్రాన్ని (Aadhaar Center) సందర్శించి ఈమెయిల్ అప్‌డేట్ చేయించుకోవాలనుకుంటే మాత్రం నిబంధనల ప్రకారం సాధారణ ఛార్జీలు వర్తించే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news