తలనొప్పి అనేది మనలో చాలామందిని తరచూ ఇబ్బంది పెట్టే సాధారణ సమస్య. పని ఒత్తిడి, ప్రయాణాలు లేదా నిద్రలేమి వల్ల వచ్చే తలనొప్పిని తగ్గించుకోవడానికి చాలామంది వెంటనే టీ, కాఫీలు తాగుతుంటారు. అయితే ప్రతిసారీ ఇవి పనిచేయవు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంట్లోనే దొరికే మూలికలు, సహజమైన పద్ధతులతో తలనొప్పిని ఆయుర్వేదం ద్వారా ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు చూద్దాం..
నీరు ఎక్కువగా తాగడం, మసాజ్: శరీరంలో నీటి శాతం తగ్గడం (డీహైడ్రేషన్) వల్ల పిత్త సంబంధిత తలనొప్పులు వస్తుంటాయి. అందుకే తరచూ నీరు లేదా ఆరోగ్యకరమైన ద్రవ పదార్థాలు తాగుతూ ఉండాలి. అలాగే తలకు సున్నితంగా ఆయుర్వేద నూనెతో మసాజ్ చేయడం వల్ల తక్షణ ఉపశమనం లభిస్తుంది.

బ్రాహ్మి, చందనం పనిచేసే విధానం: బ్రాహ్మి మూలిక శరీరానికి చల్లదనాన్ని ఇచ్చి, ఒత్తిడిని తగ్గిస్తుంది. బ్రాహ్మి నూనెతో తలకు మసాజ్ చేయడం లేదా బ్రాహ్మి, నెయ్యి చుక్కలను ముక్కులో వేయడం మంచిది.ఇక అలాగే చందనం పొడిలో నీళ్లు కలిపి నుదుటిపై పేస్ట్లా రాసి 20 నిమిషాలు ఉంచితే చల్లదనంతో పాటు నొప్పి త్వరగా తగ్గుతుంది.
తగర్ మూలిక & అలోవెరా జెల్: ఆయుర్వేదంలో వాడే ‘తగర్’ అనే మూలికా నూనెతో మసాజ్ చేయడం లేదా దాని టీ తాగడం వల్ల ఉపశమనం లభిస్తుంది. అలాగే రోజుకు మూడు సార్లు రెండు స్పూన్ల అలోవెరా జెల్ తీసుకోవడం, జీలకర్ర-ధనియాల టీ తాగడం వల్ల పిత్త దోషం వల్ల వచ్చే తలనొప్పి నయమవుతుంది.
జలుబుతో వచ్చే తలనొప్పికి పరిష్కారం: జలుబు, దగ్గు వల్ల ముక్కు మూసుకుపోయి వచ్చే తలనొప్పికి ఆయుర్వేద నూనె లేదా స్వచ్ఛమైన నెయ్యిని ముక్కు రంధ్రాలలో కొన్ని చుక్కలు వేయడం (నస్యకర్మ) వల్ల మంచి ఫలితం ఉంటుంది.
ఈ చిన్న చిన్న ఆయుర్వేద చిట్కాలను పాటిస్తే తలనొప్పి నుంచి సులభంగా ఉపశమనం పొంది రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు.
గమనిక: తలనొప్పి తీవ్రంగా ఉన్నా లేదా రోజువారీ చిట్కాలతో తగ్గకపోయినా వెంటనే సంబంధిత ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించి సలహా తీసుకోవడం శ్రేయస్కరం.
