వంట గ్యాస్ సిలిండర్ వాడే వారికి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఒక సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత మళ్లీ రెండోది బుక్ చేయడానికి చాలా రోజుల పాటు నిరీక్షించాల్సి వచ్చేది. కానీ ఇకపై ఆ ఇబ్బందులు ఉండవు. గ్రామాల్లో కూడా గ్యాస్ బుకింగ్ గడువు సమయాన్ని తగ్గించింది. దీనికి సంబంధించిన కొత్త నిబంధనలు, వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
గ్రామీణ ప్రాంతాల వారికి గుడ్ న్యూస్: గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారికి కేంద్ర సహాయ మంత్రి సురేశ్ గోపి బిగ్ గుడ్ న్యూస్ చెప్పారు. ఇక ఇప్పటివరకు గ్రామాల్లో గ్యాస్ సిలిండర్ రీఫిల్ బుకింగ్ చేసుకోవాలంటే ఒక సిలిండర్ బుక్ చేసిన నాటి నుంచి కనీసం 45 రోజుల పాటు వేచి చూడాల్సి వచ్చేది. కానీ ఆ బుకింగ్ గడువును ఇప్పుడు ఏకంగా 25 రోజులకు కుదించారు.

ఇకపై త్వరగా మళ్లీ బుక్ చేసుకోవచ్చు: ఈ కొత్త నిర్ణయంతో గ్రామాల్లో ఉండే వినియోగదారులు సిలిండర్ బుక్ చేసుకున్న 25 రోజుల తర్వాతే మరొక సిలిండర్ కోసం రీఫిల్ బుకింగ్ చేసుకోవచ్చు. ఇక పండగలు, పెళ్లిళ్ల సమయంలో లేదా పెద్ద కుటుంబాలు ఉన్న చోట సిలిండర్ త్వరగా కాలీ అయినా సరే, ఇకపై నిరీక్షించాల్సిన అవసరం లేకుండా వెంటనే మళ్లీ బుకింగ్ చేసుకునే వెసులుబాటు లభిస్తుంది.
పట్టణాలు, గ్రామాలు ఇక సమం: ఇప్పటివరకు పట్టణ ప్రాంతాల్లో మాత్రమే గ్యాస్ రీఫిల్ బుకింగ్ గడువు 25 రోజులుగా ఉండేది. ఇప్పుడు గ్రామాల్లో కూడా ఈ సమయాన్ని 25 రోజులకు తగ్గించడంతో పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల మధ్య ఉన్న వ్యత్యాసం తొలిగిపోయింది. ఫలితంగా గ్రామాల్లోని వినియోగదారులకు గ్యాస్ కొరత రాకుండా ఎంతో మేలు జరుగుతుంది.
గ్యాస్ సిలిండర్ బుకింగ్ గడువు తగ్గించడం వల్ల ముఖ్యంగా పల్లెల్లో ఉండే ప్రజలకు, రోజువారీ గ్యాస్ వినియోగం ఎక్కువగా ఉన్న కుటుంబాలకు ఎంతో ఊరట లభిస్తుంది. ప్రభుత్వ నిర్ణయంపై వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గమనిక: గ్యాస్ రీఫిల్ బుకింగ్ కోసం మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేదా గ్యాస్ ఏజెన్సీ యాప్ ద్వారా 25 రోజులు పూర్తి కాగానే సులభంగా బుక్ చేసుకోవచ్చు.
