అన్నపూర్ణ స్టూడియోస్ బయట అమర్, ప్రశాంత్ ఫ్యాన్స్ మధ్య గొడవ

-

బిగ్‌బాస్‌ సీజన్‌-7 టైటిల్‌ను యూట్యూబర్‌, రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్‌ గెలుచుకున్నాడు. రన్నరప్‌గా సీరియల్‌ నటుడు అమర్‌దీప్‌ నిలిచాడు. ఆదివారం రోజున జరిగిన బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ షూటింగ్ జరుగుతున్న అన్నపూర్ణా స్టూడియోస్‌కు పెద్ద ఎత్తున అమర్‌, ప్రశాంత్‌ అభిమానులు వచ్చారు. ప్రశాంత్‌ విజేత అని తెలియగానే సంబురాలు షురూ చేశారు. ఈ క్రమంలో అమర్ అభిమానులతో ప్రశాంత్ ఫ్యాన్స్కు చిన్న గొడవ జరిగింది. అది కాస్త చినికి గాలివానలా మారి తోపులాట, పిడిగుద్దులు గుద్దుకుంటూ అసభ్య పదజాలంతో దుర్భాషలాడుకునే వరకూ చేరింది. ఈ క్రమంలో అటుగా వెళ్తున్న కొండాపూర్‌-సికింద్రాబాద్‌ ఆర్టీసీ బస్సుపైన ఇరువురి ఫ్యాన్స్ దాడి చేసి, అద్దాన్ని పగలగొట్టారు.

మరోవైపు హౌస్‌ నుంచి బయటకు వచ్చిన అమర్‌ దీప్‌ వాహనాన్ని చుట్టుముట్టిన ప్రశాంత్ ఫ్యాన్స్ ముందుకు కదలనీయకుండా దాడిచేసే ప్రయత్నం చేశారు. కారు అద్దాలు పగలగొట్టి, అమర్‌ను బయటకు దిగమంటూ నినాదాలు చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అన్నపూర్ణా స్టూడియోస్‌కు చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news