ప్రదీప్ పై దర్శకుడు ఫిర్యాదు.. ఇక `30 రోజుల్లో ప్రేమించడం ఎలా?` ఆగిపోయిన‌ట్టేనా..?

-

తెలుగు ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్న వారిలో యాంక‌ర్ ప్ర‌దీప్ ఒక‌రు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈయ‌న చేసిన షోస్ అన్నీ దాదాపు సూప‌ర్ హిట్ అయ్యాయి. ప్ర‌స్తుతం బుల్లితెర మీద సత్తా చాటిన ఈయ‌న వెండితెర మీద అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గతంలో పలు చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్‌లో నటించిన ప్రదీప్‌ మాచిరాజు, త్వరలో హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఈయ‌న హీరోగా మున్నా అనే దర్శకుడు సినిమా చేస్తున్నాడు. దీనికి 30 రోజుల్లో ప్రేమించటం ఎలా అనే టైటిల్ కూడా కన్ఫర్మ్ చేసారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ మంచి అప్లాజ్ తెచ్చుకుంది. 1947లో జరిగే పీరియాడిక‌ల్ క‌థ ఇది. అయితే తాజాగా ప్రదీప్ మాచిరాజు నటించడానికి వీల్లేదంటూ, ఓ యువ దర్శకుడు పోలీసులను ఆశ్రయించాడు.

మరిన్ని వివరాల్లోకి వెళితే, “30 రోజుల్లో ప్రేమించడం ఎలా?” అనే చిత్రం ప్రదీప్ హీరోగా రూపొందనున్నట్టు ఇటీవల ఎనౌన్స్ మెంట్ వచ్చింది. అయితే, గతంలో ఓ యువతిని వేధించిన కేసులో ప్రదీప్ రెండు రోజులు జైలుకు వెళ్లి వచ్చాడు. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిలిం సర్టిఫికేషన్‌ రూల్స్‌ కు వ్యతిరేకంగా ప్రదీప్‌ ప్రవర్తించినందున, ఈ చిత్రం షూటింగ్ ను అడ్డుకోవాలని, ప్రదీప్ నటించకుండా చూడాలని మేడ్చల్‌ జిల్లా రాంపల్లికి చెందిన శ్రీ రామోజు సునిశిత్‌ అనే యువ దర్శకుడు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆపై మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రదీప్‌ తో పాటు సినీ దర్శకుడు కూడా నిబంధనలను అతిక్రమించారని ఆరోపించాడు. షూటింగ్‌ ఆపాలని తక్షణం ఆదేశాలు జారీ చేయాలని కోరాడు. దీంతో ఈ సినిమా ముందుకు సాగుతుందా అన్న‌ది చూడాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version