ఆ క్షణంలో ఆనందం పట్టలేక ఎడ్చేశాను.. మెగాస్టార్

-

తాజాగా మెగాస్టార్ చిరంజీవి కొన్ని రోజుల క్రితం తను కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు అది బాధతో కాదు ఆనందంతో అంటూ చెప్పుకొచ్చారు..

టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి తాజాగా తాను ఎమోషనల్ అయినా సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు.. ప్రతి విషయాన్ని తన అభిమానులతో పంచుకుంటూ వస్తున్నారు మెగాస్టార్ అలాగే ఈ మధ్యకాలంలో ఎక్కువగా అభిమానులతో టచ్ లో కూడా ఉంటూ చాలా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అయితే ఈ సందర్భంగా గత కొన్ని రోజుల క్రితం అత్యంత ఎమోషనల్ అయినా ఒక విషయం కోసం చెప్పుకొచ్చారు. రామ్ చరణ్ ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్నారని విషయం విని కన్నీళ్లు ఆపుకోలేకపోయాను అని అన్నారు ఆ క్షణంలో సంతోషాన్ని పట్టలేక భావోద్వేగానికి లోనయ్యానని తెలిపారు.. అలాగే ఈ సందర్భంగా మాట్లాడిన మెగాస్టార్.. “చాలా ఏళ్ళుగా మేమంతా ఈ సందర్భం కోసం ఎదురు చూస్తున్నాం.. జపాన్ టూర్ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన రామ్ చరణ్, ఉపాసన.. రాగానే ఉపాసన తల్లి కాబోతున్నట్టు శుభవార్త చెప్పారు.. ఆ వార్త వినగానే నేను సురేఖ ఎంతగానో సంతోషించాము.. ఆ క్షణంలో నాకు కన్నీళ్లు ఆగలేదు సంతోషాన్ని పట్టలేక ఏడ్చేసాను అయితే ఉపాసనకు మూడు నెలలు వచ్చాక మాత్రమే ఈ విషయాన్ని అందరితో చెప్పాలని అనుకున్నాము అందుకే ఇప్పటివరకు వెల్లడించలేదు..” అంటూ చెప్పుకొచ్చారు..
అలాగే తామంతా మెగా వారసుడు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని తెలిపారు..

మెగాస్టార్ వాల్తేరు వీరయ్య సినిమాలో నటించారు ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కాబోతుంది బాబి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మెగాస్టార్ సరసన శృతిహాసన్ నటించింది.. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్ అందర్నీ ఆకట్టుకుంది అలాగే ఈ సినిమా పైన ఫుల్ హైప్ ని కూడా క్రియేట్ చేసింది చిత్ర బృందం..

Read more RELATED
Recommended to you

Exit mobile version