సినీనటి రమ్యశ్రీకి ఊహించనిషాక్ తగిలింది. హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న ఎఫ్.సి.ఐ. కాలనీ లే అవుట్ లో రోడ్లు మార్కింగ్ చేపట్టారు హైడ్రా అధికారులు. ప్లాట్ ఓనర్స్ సమక్షంలో హైడ్రా అధికారులు రోడ్లు మార్కింగ్ చేస్తుండగా.. వీడియో తీస్తున్న ప్లాట్ యజమానులపై సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్ రావు అనుచరులు దాడి చేసినట్లు చెబుతున్నారు.

ప్లాట్ యజమానురాలైన సినీనటి రమ్యశ్రీ, ఆమె సోదరుడు ప్రశాంతపై కత్తి, క్రికెట్ బ్యాట్ తో శ్రీధర్ రావు అనుచరులు దాడికి పాల్పడ్డారు. దింతో గాయాల పాలైన సినీనటి రమ్యశ్రీ, ఆమె సోదరుడు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్ ఎదురుగానే పట్టపగలు దుండగులు.. తమపై హత్యాయత్నం చేసేందుకు ప్రయత్నించారని వాపోయారు సినీ నటి రమ్యశ్రీ. సంధ్య కన్వెన్షన్ శ్రీధర్ రావు ఆగడాలకు అడ్డుకట్ట వేసే విధంగా పోలీసులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు నటి రమ్య శ్రీ.
పట్టపగలే.. కత్తులు, బ్యాట్ లతో దాడులకు తెగించిన కబ్జా రాయుల్లు
హైదరాబాద్ – గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న ఎఫ్.సి.ఐ. కాలనీ లే అవుట్ లో రోడ్లు మార్కింగ్ చేపట్టిన హైడ్రా
ప్లాట్ ఓనర్స్ సమక్షంలో హైడ్రా అధికారులు రోడ్లు మార్కింగ్ చేస్తుండగా.. వీడియో తీస్తున్న ప్లాట్ యజమానులపై… pic.twitter.com/FC8gPA5xLG
— Telugu Scribe (@TeluguScribe) June 17, 2025