Akhanda : మాస్ ఆడియన్స్ ఆకలితీర్చే సినిమా.. ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్‌లు ఎవరంటే?

-

Akhanda : నందమూరి న‌ట సింహాం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబో అంటే.. మామూలుగా ఉండ‌దు. మాస్ ఆడియ‌న్స్ కు పండుగే. అదిరిపోయే డైలాగ్స్, ఫైట్స్ ల‌తో బాలయ్య త‌న‌ అభిమానులకు పూన‌కాలు తెప్పిస్తుంటారు. ఇప్ప‌టికే వీరి కాంబోలో సింహా, లెజెండ్ లాంటి సూప‌ర్ డూప‌ర్ హిట్స్ కొట్టిన త‌రువాత రాబోతున్న చిత్రం అఖండ. ఇప్పటికే ఈ చిత్రం మీద భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.

మాస్ ఆడియన్స్ ఆకలితీర్చేలా సినిమా రూపొందించిన‌ట్టు తెలుస్తుంది. ఇప్పటికే విడుద‌లైన టీజర్, సాంగ్, పోస్టర్లు అన్ని.. పాజిటివ్ టాక్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 2 న విడుద‌ల చేయ‌డానికి సిద్దంగా ఉన్నారు మూవీ మేక‌ర్స్. ఈ క్రమంలో మూవీ ప్రమోష‌న్స్ బిజీ బిజీ అయ్యింది చిత్ర బృందం.

బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్‌పై అఖండ చిత్రాన్ని మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కోసం తమన్ అద్భుతమైన పాటలు అందించినట్టు కనిపిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చింది. నవంబర్ 27న శిల్పా కళా వేదికలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రుగ‌నున్న‌ట్టు తెలిపింది చిత్రయూనిట్‌. ఈ ఈవెంట్ లో ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరు కాబోతోన్నారు. అయితే.. ఈ ఈవెంట్‌కు జూనియ‌ర్ ఎన్టీఆర్ రాబోతోబోతున్న‌ట్టు తెలుస్తోంది. వీరితో పాటు గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి వంటి దర్శకులు కూడా వస్తారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news